America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి! అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక హనీక మృతి చెందింది. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు కారులో గుడికి బయల్దేరారు. కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 01 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Road Accident : అమెరికాలో(America) ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా(NTR District) పెనుగంచిప్రోలు(Penuganchiprolu) మండలం కొణకంచి గ్రామానికి చెందిన నరేశ్- గీతాంజలి దంపతులు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు(Software Engineers) గా పనిచేస్తున్నారు. వారికి ఓ బాబు, పాప హానిక (6) ఉన్నారు. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా అందరూ కారులో గుడికి బయల్దేరారు. కారు(Car Accident) పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది. గీతాంజలికి బలమైన గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొణకంచి గ్రామంలో ప్రమాదం గురించి తెలియడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. Also Read : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన! #girl #andhra-pradesh #car-accident #penugranchiprolu #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి