Medchal : వేగంగా వచ్చి బైక్‌ ని ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి..కూతురికి తీవ్రగాయాలు!

మేడ్చల్‌ లో యూటర్న్‌ తీసుకుంటున్న బైక్‌ ను ఓ కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ మీద ఉన్న తండ్రి పంకజ్‌ అక్కడికక్కడే మరణించగా...కుమార్తె పూజ తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Medchal : వేగంగా వచ్చి బైక్‌ ని ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి..కూతురికి తీవ్రగాయాలు!

Road Accident : మేడ్చల్‌ (Medchal) లో బైక్‌ పై రోడ్డు దాటుతుండగా..వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడం (Car Accident) తో బైక్‌ మీద ప్రయానిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా..మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ (Bihar) కు చెందిన పంకజ్‌ , ఆయన కుమార్తె పూజ కలిసి బైక్‌ పై తుర్కపల్లి నుంచి యాడారం వెళ్లేందుకు మురహరి పల్లి చౌరస్తా వద్ద రాగానే.. రాజీవ్ రహదారి వద్ద యూటర్న్‌ తీసుకుని రోడ్డు దాటుతున్నారు.

ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకువచ్చింది. బైక్ ను అతివేగంగా ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న తండ్రి కూతురు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రి పంకజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన పంకజ్ ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూజను చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్…. 20 మంది విద్యార్థులకు అస్వస్థత!

Advertisment
తాజా కథనాలు