Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి

తెలంగాణలోని మెదక్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి
New Update

Telangana : తెలంగాణలోని మెదక్‌ (Medak) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్లున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ అతి వేగంతో ఢీకొట్టింది.

ఈ ఘటనలో వెనుక లారీలోపల కూర్చున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం…మరో మూడు రోజులు ఉంటుందన్న ఐఎండీ!

#4-dead #road-accident #medak #lorry
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి