Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి!

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి.

New Update
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్‌ మీద ఉన్న ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారు.

బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. మృతులంతా భీమవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన వాహనం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read: ఎస్‌ఆర్‌ నగర్‌ లో యువకుడి దారుణ హత్య

Advertisment
తాజా కథనాలు