Revenge angle: ఉత్తరప్రదేశ్లో తోడేళ్ళు అక్కడ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో తోడేళ్ళు దాడులు చేస్తున్నాయి. చిన్నపిల్లలే టార్గెట్గా దాడి చేస్తున్న వీటిని పట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. కనిపిస్తే కాల్చి చంపేయమని యోగి గర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. తోడేళ్ళ వలన కొన్ని గ్రామాలకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. అసలు ఇలా సడెన్గా తోడేళ్ళు ఎందుకు పగ పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి. అర్ధరాత్రి పూటే ఎందుకు దాడులు చేస్తున్నాయి. చిన్నారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడ అందరినీ వేధిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Uttar Pradesh: తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే…
ఉత్తరప్రదేశ్ను తోడేళ్ళ గుంపు వణికిస్తోంది. ఇవి కనిపిస్తే కాల్చి చంపేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్.
Translate this News: