రేవంత్‌ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్‌ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ

బీజేపీ విజయాలకు తామెలా కారణమవుతామంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టుకే ఆరెస్సెస్ లో ఉందని, గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని విమర్శించారు.

రేవంత్‌ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్‌ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ
New Update

Telangana Elections 2023: నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ విజయాలకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందని అసదుద్దీన్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా, బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన చోట మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు.

#telangana-elections-2023 #pcc-chief-revanth-reddy #telangana-politics #asaduddin-owaisi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe