భారతీయులకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. రోజురోజుకూ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా ఎదురుచూసే మహిళలు ఎంతోమంది ఉంటారు. అధిక ధరలతో ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోవడానికి తోడు హెచ్చు బంగారం ధరలు నేపథ్యంలో పసిడికి డిమాండ్ తగ్గింది. రికార్డ్ స్థాయికి చేరిని బంగారం ధరలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి. వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం…ప్రస్తుత ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మనదేశంలో బంగారం అమ్మకాలు 7శాతం పతనమై 158.1టన్నుల వరకు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 170.7టన్నుల డిమాండ్ ఉంది.
పూర్తిగా చదవండి..వన్నె తగ్గిన పసిడి..డిమాండ్లో పతనం..!!
భారతీయులకు బంగారం మక్కువ ఎక్కువ. అదొక స్టేటస్ సింబల్. అంతేకాదు ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే...ఆదుకునే గొప్ప సాధనం బంగారం. చాలామంది భారతీయులు తమ కష్టార్జితాన్ని శక్తిమేకు బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తక్కవ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకునేందుకు 90శాతం దిగుమతులు చేసుకుంటుంది. 2022లో విదేశాల నుంచి 706 టన్నుల బంగారం భారత్ కు దిగుమతి అయ్యింది.
Translate this News: