AP News: గంజాయి మత్తులో కౌన్సిలర్ తమ్ముడు వీరంగం.. వైద్యుడిపై దాడి!

ఏపీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రవి అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. మత్తులో ఉన్నప్పుడు వైద్యం చేయలేనని చెప్పిన డాక్టర్‌ కార్తికేయపై తన అన్న కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో రవి దాడికి పాల్పడ్డాడు. రక్షణ కావాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
AP News: గంజాయి మత్తులో కౌన్సిలర్ తమ్ముడు వీరంగం.. వైద్యుడిపై దాడి!

Krishna: ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ యువకుడు గంజాయి మత్తులో వీరంగా సృష్టించాడు. గ్యాస్ కారణంగా కడుపులో నొప్పిగా ఉందంటూ ఆర్ఎంపీ డాక్టర్ హుండీ కార్తికేయ దగ్గరకు వెళ్లిన రవి.. తనకు ఇంజక్షన్ చేయాలంటూ పట్టుబట్టాడు. అయితే గంజాయి తీసుకున్నట్లు గుర్తించిన వైద్యుడు.. చికిత్స చేసేందుకు నిరాకరించాడు. 'గంజాయి మత్తులో ఉన్నావు. వైద్యం చెయడం కుదరదు. ఇలా చేస్తే ప్రమాదం' అంటూ మొదట నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఇవేవి పట్టించుకోకుండా తనకు వైద్యం చేయాలంటూ రవి రెచ్చిపోయాడు. డాకర్ట్ పై దాడికి ప్రయత్నించాడు.

అంతటితో ఆగకుండా తన అన్న 12వ వార్డు కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డాడు. 30 మంది వెంటపెట్టుకెళ్లి కార్తికేయను కొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న కాంపౌండర్ పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా గాయపరిచారు. కక్షతోనే తనపై దాడులకు పాల్పడ్డారంటూ ప్రాణం భయంతో పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి కార్తికేయ వారిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు