Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ ఎలర్ట్.. రెండు రోజులు పాటు వర్షాలు..! సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురుస్తాయి. ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ చెప్పింది. By Trinath 19 Sep 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Rain alert: అసలు వర్షాలు పడడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సెప్టెంబర్లోనూ ఉక్కపోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కురిస్తే కుంభవృష్టి లేకపోతే అసలు చుక్కే లేని దుస్థితి. వరుణ దేవుడితో ఇదే చికాకు. అయితే సెంచరీ, డబుల్ సెంచరీ బాదుతాడు.. లేకపోతే డకౌట్ అవుతాడు. అంతేకానీ కాసేపు క్లాసిక్గా షాట్స్ ఆడుతూ, మధ్యమధ్యలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆనందపరచాలని అనుకోడు. హ్యాపీగా చిరుజల్లుల్లో తడిచి ముద్దై చాలా కాలం అయ్యింది కదా.. అయితే ఇక మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. చిరుజల్లులకు సమయం అసన్నమైంది. రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు.. అంటే సెప్టెంబర్ 20,21 తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని చెప్పింది. అటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ వర్షాలు కురవనున్నాయని అధికారులు చెప్పారు. వాయువ్య రాజస్థాన్ నుండి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఒక ద్రోణి వెళుతుండగా, దక్షిణ రాజస్థాన్ పరిసరాల్లో తుఫాను ప్రసరణ ఉంది. అదనంగా, మరొక తుఫాను వాయువ్య ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది, దీని ప్రభావంతో, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ భారతదేశం: సౌరాష్ట్ర, కచ్ మీదుగా గుజరాత్ ప్రాంతం-నైరుతి రాజస్థాన్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వరకు విస్తృత వర్షపాతం ఉంటుంది. తూర్పు భారతదేశం: సెప్టెంబరు 20-23 వరకు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్లో, సెప్టెంబర్ 21-23 వరకు, ఒడిశాలో గంగా నది పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశం: సెప్టెంబరు 19-23 వరకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో.. సెప్టెంబర్ 20-23 నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరుగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సెప్టెంబరు 20-23 వరకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లలో సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య భారతదేశం: సెప్టెంబరు 20-23 వరకు చత్తీస్గఢ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశం: సెప్టెంబరు 19న కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురుస్తాయి. రేపు, ఎల్లుండు కూడా వర్షాలు కురవనున్నాయి. ALSO READ: డిప్రెషన్ అంటే సినిమాలో చూపించే తాగుబోతు క్యారెక్టర్ కాదు బాసూ.. అది వేరే..! #rain-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి