Rain effect: రెయిన్‌ ఎఫెక్ట్‌.. భారత్‌-ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దు

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Rain effect: రెయిన్‌ ఎఫెక్ట్‌.. భారత్‌-ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దు
New Update

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మధ్య మధ్యలో వరుణుడు కాస్త శాంతించినా గ్రౌండ్‌ సిబ్బంది పిచ్‌ను ఆరబెట్టే సమయానికి మళ్లీ వర్షం పడటంతో పిచ్‌ మొత్తం తడిసింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు.

ఇంగ్లండ్‌తో జరిగేదీ ప్రాక్టీస్‌ మ్యాచ్చే అయినా అభిమానులు మాత్రం స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ వారి అశలను అడియాశలు చేస్తూ వరుణుడు మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌, శ్రీలంకపై బంగ్లాదేశ్‌ టీమ్‌లు విజయం సాధించాయి.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట ట్యాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ (80), కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌ సెంచరీతో చెలరేగాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్ (53) హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్‌ నిర్ణిత 50 ఓవర్లకు 5 వికెట్ల కోల్పోయి 345 పరుగులు భారీ స్కోర్‌ చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీసుకన్నారు.

అనంతరం 346 పరుగులు భారీ లక్ష్య చేధనకు దిగిన కివీస్‌కు సరైన ఆరంభం దక్కలేదు. న్యూజిలాండ్‌ టీమ్ ఓపెనర్‌ వికెట్‌ను త్వరగానే కోల్పొయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర 97 పరుగులతో చెలరేగాడు. అతనితోపాటు చాప్‌మన్‌ 65, మిచెల్ 59, విలియమ్సన్ 54 హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ టీమ్ 43.4 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

మరోవైపు వరల్డ్‌ కప్‌లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించి అసలైన సమరానికి ముందే చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక టీమ్‌ 49.1 ఓవరలో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 264 పరుగులు టార్గెట్‌తో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 42 ఓవర్లోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు. టాంజిద్ హసన్ 84, లిట్టన్ దాస్ 61, కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 67, ముష్ఫికర్ రహీమ్ 35 పరుగులతో రాణించారు.

#match-cancellation #england #rain-effect #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి