/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Two-more-days-of-rains-in-AP-and-Telangana.Yellow-warnings-issued-jpg.webp)
Rain Alert For Telangana: పార్లమెంట్ నాలుగో విడత ఎన్నికలు దేశవ్యాప్తంగా సోమవారం జరగనున్నాయి. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు (Lok Sabha Elections) ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుండగా..వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
మంగళవారం హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల, ఉమ్మడి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
Also Read: బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క టీ ఎంతో ఉపయోగకరం..ఎలా , ఎప్పుడు తీసుకోవాలో తెలుసా!