Rain Alert for Telugu states: రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్లో భారీ వర్షం పడింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ జంట నగరాలతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఐతే మరో మూడ్రోజుల వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert for Telugu states: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక!
ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 2.1మీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఉండగా.. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురుస్తాయి. తీరం వెంబడి 45-55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Translate this News: