KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. మీ ఇద్దరిలో ఎవరు సన్నాసి? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ సమావేశంలో డిమాండ్ చేశారు.

New Update
KTR: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. మీ ఇద్దరిలో ఎవరు సన్నాసి? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Telangna: విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా? లేక రేవంత్ రెడ్డి సన్నాసా? చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ తెలపాలంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6వేల అదనపు పోస్టులతో విద్యార్ధులకు, నిరుద్యోగులకు దగా చేస్తున్నాడు. నేడు విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టం. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా నా? అంటూ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుంది..
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్. తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిరుద్యోగులు విద్యార్థులు అడుగుతున్నారు. నిరుద్యోగులందరికీ యువకులకు రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నాడు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా అనేక మందిని విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోపాటు, ఇతర పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఉద్యోగాలను.. నోటిఫికేషన్లను అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి విద్యార్ధుల చుట్టు చేరి వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాసా.. లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాందీ సన్నాసా రేవంత్ చెప్పాలన్నారు.

తలలు.. వీపులు పగలగొట్టడమే..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి తలలు పగలగొట్టడం.. వీపులు పగలగొట్టడమే ప్రజల పాలనా అని ప్రశ్నించారు. పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ప్రవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతోని మెగా డీఎస్సీ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ ఈనాడు మోగా డీఎస్సీ మాట మరిచిపోయిండని గుర్తు చేశారు.

డీఎస్సీ పేరుతో మోసం..
అలాగే ఇప్పుడు కేవలం సూమారు 6000 ఉద్యోగాల అదనంగా ఇచ్చి డీఎస్సీ పేరుతో యువకులను మోసం చేస్తుండన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారు. ఈరోజు విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు. తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులపైన ప్రజల పైన దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను, మేము తిరిగే అధికారంలోకి వచ్చినంక వదిలిపెట్టం. పదేళ్ల మన ప్రభుత్వ హయాంలో లక్ష అరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉండే. అందులోంచి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను రేవంత్ రెడ్డి ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

95% స్థానిక రిజర్వేషన్లు..
విద్యార్థుల ఉద్యోగాల కోసం 95% స్థానిక రిజర్వేషన్లు కల్పించాం. పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగింది. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. నిజాయితీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేలమంది ఈ పార్టీకి ఆస్తిగా ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలి. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్ధి విభాగం అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు