Rahul-Priyanka: రామప్పకు చేరుకున్న రాహుల్, ప్రియాంక..

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామివారి చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ
New Update

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు తెలంగాణకు చేరుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామివారి చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తదితర నాయకులు, పార్టీ శ్రేణలు ఉన్నారు. ఇక ఈ ప్రత్యేక పూజల అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరీ యాత్రను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.

#priyanka-gandhi #congress #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe