/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/drunk.jpg)
Vikarabad : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk & Drive) లో పట్టుబడిన నిందితులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు(District Majestic Court) వినూత్న రీతిలో శిక్ష విధించింది. జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ నలుగురు నిందితులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(District Government Hospital) లో 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
Also Read : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా?