పిల్లలు చేసిన తప్పుకు..తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా!

పిల్లలు తెలియక చేసిన తప్పుకు.. తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా విధించిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా లో చోటు చేసుకుంది.బీచ్ లో అనుమతి లేకుండా తీసుకువెళ్లిన వస్తువులకు గాను వారికి అధికారులు ఈ జరిమానా విధించారు.

పిల్లలు చేసిన తప్పుకు..తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా!
New Update

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షార్లెట్ రస్ అనే మహిళ..తన పిల్లలను సమీపంలోని పిస్మో బీచ్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలు సముద్రపు అలల్లో ఆడుకుంటూ ఉన్న సమయంలో వారికి సముద్రపు గుల్లలుగా భావించి క్లాన్స్ ను ఒడ్డుకు తీసుకెళ్లారు.అయితే బీచ్ లో క్లాన్స్ ను బయటకి తీసుకువెళ్లందుకు అక్కడి అధికారుల అనుమతి పొందాలి.కాని వారు ఆ పని చేయలేదు.అయితే బీచ్ కు వెళ్లిన 5 గురు పిల్లలు కలసి మొత్తం 72  క్లాన్స్ ను సేకరించారు.

ఈ సందర్భంలో, సముద్రతీరంలో మత్స్యశాఖ అధికారులు సరైన అనుమతి లేకుండా క్లాన్స్ అనే మక్కలను సేకరించిన పిల్లలను పట్టుకున్నారు. అధికారులు పిల్లల తల్లి షార్లెట్ రస్, 88,000 US డాలర్లు (భారత కరెన్సీలో రూ. 73 లక్షలు) జరిమానా విధించారు. దీంతో షార్లెట్ రస్ షాక్ అయ్యింది.తెలియక చేసిన తప్పుకు పిల్లలకు ఇంత జరిమానా విధించాలా? అని ఆమె మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను మానసికంగా ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె తెలిపారు.
#trending-news #trending
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe