NTR District: కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం.!

ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అవి శాంతి పూజలా లేక క్షుద్రపూజలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
NTR District: కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం.!

NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం కృష్ణా నది( Krishna River) పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడ చేసింది శాంతి పూజలా లేక క్షుద్రపూజలా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ఒక ప్రవేటు స్థలంలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అయితే, ప్రత్యేక పూజలు చేసేందుకు పంచాయతీని గానీ, పోలీసులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!

మాజీ మంత్రి కూడా పూజలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, నిర్వహకులు మాత్రం వివాహం తర్వాత పూజారులు ఇచ్చిన సూచనల మేరకు శాంతి పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. పెళ్లి అయిన వారి పిల్లలకు గ్రహ దోషం ఉన్నందు వల్ల విఘ్నేశ్వర పూజ చేస్తున్నట్లు తెలిపారు. మంచి పిల్లలు పుట్టాలని దోషం పోవాలని అందు కోసమే ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.


Also Read: ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే..

అయితే, ఇంటి దగ్గర చేయాల్సిన పూజలు.. ఎవరూ లేని ప్రాంతంలో చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా శాంతి పూజలు చేస్తే అనుమతులు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్న తలెత్తుతుంది. విషయం తెలిసి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉన్న వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని తెలుస్తోంది. మా సొంత స్థలంలో ఏమైనా చేసుకుంటాం.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం అనుమానాలకు దారి తీస్తోంది.

Advertisment
తాజా కథనాలు