Breaking : త్రిపుర గవర్నర్‎గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి...!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ నేతకు కీలక పదవి దక్కింది. త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఒడిశా గవర్నర్ గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.

New Update
Breaking :  త్రిపుర గవర్నర్‎గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి...!!

త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రాసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. నల్లు ఇంద్రాసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ అగ్రనేత. రఘుబస్ దాస్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి.

ఇక నల్లు ఇంద్రాసేనా రెడ్డి ఉమ్మడి ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన స్వస్థలం సూర్యపేట జిల్లా. ఇంద్రసేనారెడ్డి 1983, 1985, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009లో మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి, 2014లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల మక్కువను పెంచుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా నగర కార్యదర్శిగా ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా జైలుకు వెళ్లారు. జనతా పార్టీ రాష్ట్ర శాఖ యువ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, బిజెపి ఏర్పడిన తర్వాత యువమోర్చా తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్లు ఇంద్రాసేనారెడ్డి పనిచేశారు. బిజెపి రాష్ట్ర కోశాధికారిగా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా పని చేస్తున్నారు.1999 నుండి 2003 వరకు బిజెపి శాసనసభ పక్ష నాయకులుగా పనిచేశారు.

1983లో మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. నాదెళ్ల భాస్కర్ రావు పైన 1985లో పోటీ చేసి విజయం సాధించారు. 1999లో మరోసారి గెలిచారు. జాతీయ పార్టీ తెలంగాణ కు అనుకూలంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్.. జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో జాతీయ పార్టీగా తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెడితే సమర్థిస్తామని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు