Prashant Kishore : ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసారి చిత్తుగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని పేర్కొన్నారు.

New Update
Prashant Kishore : ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ కీలక వ్యాఖ్యలు

AP Election Results : ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల (Assembly - Parliament Elections) ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ (Prashant Kishore) కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడని అన్నారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు. పదేళ్లుగా ఎన్నికల స్ట్రాటజిస్టుగా చేస్తున్నానని.. ఎవరు గెలుస్తారో, ఎవరి ఓడిపోతారో అంచనా వేయగలను అని అన్నారు. చంద్రబాబు కూడా నేనే గెలుస్తా అంటున్నారని అన్నారు.

కానీ జగన్ (YS Jagan) మాత్రం లాస్ట్‌ టైమ్‌ కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటున్నారని పేర్కొన్నారు. రేపు కౌంటింగ్‌ సగం అయ్యేవరకు కూడా జగన్ అదే మాట చెబుతారని తెలిపారు. రాసిపెట్టుకోండి.. ఫలితాలు చూసి జగన్ షాక్‌ తింటారని ఆయన అన్నారు.

Also Read : తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్

Advertisment
తాజా కథనాలు