KA Paul: సీఎం రేవంత్ డేంజర్లో ఉన్నారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు ఆర్టీవీ అన్సెన్సార్డ్లో పాల్గొన్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డేంజర్లో ఉన్నారని అన్నారు. రేవంత్ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్లోని నలుగురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూను చూడండి. By V.J Reddy 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి KA Paul Interview: ఆర్టీవీ అన్సెన్సార్డ్లో పాల్గొన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డేంజర్ లో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి గండం ఉందని అన్నారు. రేవంత్ ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్లోని నలుగురు నేతలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే తెలంగాణ ప్రజలకు చేస్తానని చెప్పిన హామీలను అమలు చేయాలని అన్నారు. కేసీఆర్ కళ్లు నెత్తికెక్కడం వల్లే ప్రజలు ఆయన్ను ఓడగొట్టారని.. తెలంగాణ ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ని సీఎం పదవి నుంచి ఎవరు తొలిగించాలని కుట్రలు చేస్తున్నారో తెలుసుకోవాలంటే కింది వీడియోలో చూడండి. రేవంతే నన్ను కలిశారు.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనను కలవాలని అనుకున్నారని.. ఒక్కసారి వచ్చి పర్సనల్ గా కలిశారని అన్నారు. ఆ తరువాత తాను సీఎం నివాసానికి వెళ్లి కలిశానని తెలిపారు. రేవంత్ సీఎం అయ్యాక అసెంబ్లీలో, సచివాలయంలో మొత్తం నాలుగు సార్లు కలిసినట్లు తెలిపారు. రేవంత్ తనకు తప్పుడు అని అన్నారు. తమ్ముడు బాగుండాలని తాను కోరుకుంటానని తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తానని కేఏ పాల్ అన్నారు. Also Read: టాప్ యంగ్ గేమర్స్తో కలిసి గేమ్స్ ఆడిన ప్రధాని మోదీ.. #ka-paul #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి