Guntur Kaaram: గురూజీ ఏమైనా చేయగలరు..త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సెటైర్లు

ఇవన్నీ గురూజీ థింగ్స్..డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మీదనే కౌంటర్లు వేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. యుద్దనపూడి కీర్తికెరటాలు స్టోరీ లైన్‌తో గుంటూరు కారం సినిమా తీశారు అన్న కాంట్రవర్శీ మీద ఆమె కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న అర్ధంలో పోస్ట్ పెట్టింది.

New Update
Guntur Kaaram: గురూజీ ఏమైనా చేయగలరు..త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సెటైర్లు

Poonam kaur:సినిమాల్లో హీరోయిన్‌ గా కన్నా కాంట్రవర్శీ కామెంట్లు చేయడంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ పూనమ్ కౌర్. తన కామెంట్లతో నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. తెలివిగా తప్పించుకోవడంలో పూనమ్ మేటీ అని చెప్పొచ్చు. హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) వివాదాల్లోనే, వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ముఖ్యంగా పవన్‌ విషయంలో ఆమె చేసే కామెంట్లు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మీద ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

గురూజీ ఏమైనా చేయగలరు...

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న భారీ అంచనాల సినిమాల్లో గుంటూరు కారం (Guntur Kaaram) ఒకటి. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేట్ ఆంధ్రీ కథనం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం స్టోరీ లైన్‌ను యుద్దనపూడి సులోచనారాణి కీర్తి కిరీటాల నుంచి తీసుకున్నారని తెలుస్తోంది.

దీని మీద నటి పూనమ్ కౌర్ పోస్ట్ పెట్టింది. త్రివిక్రమ్‌కు ఇలా కథలనుకాపీ కొట్టడం కొత్తేమీ కాదంటూ డైరెక్ట్‌గా అటాక్ చేసింది. ఆయన ఏదైనా చేయగల సమర్ధులు. తరువాత దాన్ని ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. చాలామంది ఆయన్ను గుడ్డిగా నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం త్రివిక్రమ్‌కు మాత్రం బాగా సపోర్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదెందుకో నాకు ఇప్పటికీ అర్ధం కాదంటూ త్రివిక్రమ్, కేసీఆర్ గవర్నమెంట్...ఇద్దరి మీదా కౌంటర్లు వేసింది. ఈ పోస్ట్‌కు గురూజీ థింగ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది.

publive-image

అ ఆ సినిమా కూడా సులోచనారాణి నవలే...

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన అఆ సినిమా సూపర్ మిట్ అయింది. యుద్ధనపూడి సులోచనారాణి నవల అయిన మీనాను యాజిటీజ్ గా దింపేశారు మాటల మాంత్రికుడు. పైగా దానికి సంబంధించిన క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు. సాధానంణంగా కథలు, నవలలను సినిమాగా తీసుకుంటే సదరు రచయితకు క్రెడిట్స్ ఇస్తారు. ముందే చెబుతారు కూడా. కానీ త్రివక్రమ్ ఇవేమీ చేయలేదు. దీని అప్పుడు రచ్చ ర్చ కూడా అయింది. అయితే త్రివిక్రమ్ విషయంలో ఎలవరూ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు పూనమ్ కౌర్ ఎత్తిపొడిచింది.

Also Read: ‘బ్రహ్మముడి’ కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?

పూనమ్ కౌర్...

మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్‌ కౌర్‌. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం పలు వెబ్ సీరీస్‌లో నటిస్తోందని సమాచారం. పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్స్‌తో ఈమె బాగా పాపులర్ అయింది. దీంతో పాటూ రాజకీయాల మీద కూడా పూనమ్ సంచలన కామెంట్స్ చేస్తుంటుంది.

గుంటూరు కారం...

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గుంటూరు కారం. వీరి కలయికలో ఇది మూడో సినిమా. అంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు