తిరుపతి లడ్డూ.. సుప్రీంకోర్టు కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్

తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దేవుణ్ణి  రాజకీయాల్లోకి  లాగొద్దంటూ న్యాయస్థానం కామెంట్స్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'దేవుణ్ణి  రాజకీయాల్లోకి  లాగకండి. జస్ట్ ఆస్కింగ్' అన్నారు.  

jjj
New Update

Prakash Raj: తిరుపతి దేవస్థానం లడ్డూ అంశంపై నటుడు ప్రకాష్‌ రాజ్ మరోసారి స్పందించారు. లడ్డూ నెయ్యి కల్తీ వ్వవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దంటూ న్యాయస్థానం సూచించింది. దీంతో ఇప్పటికైనా దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం మానుకోవాలంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్ట్ పెట్టారు. 'దేవుణ్ణి  రాజకీయాల్లోకి  లాగకండి. జస్ట్ ఆస్కింగ్' అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతోపాటు సుప్రీంకోర్టు ఫొటోను షేర్ చేశారు. 

 

 

తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌కు పవన్‌ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్‌ రీకౌంటర్‌ ఇస్తున్నారు. గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం అని ట్వీట్ చేశారు. నిన్న చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అతేకాదు హీరో కార్తీకి మద్దతుగా నిలిచారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో!' జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ వెటకారంగా ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉంటే లడ్డూ విషయంలో  పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన  వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జరిగింది తెలుసుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు. దీనిపై మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్‌ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. లడ్డూ వివాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అర్థం కాకపోతే మరొకసారి తన ట్వీట్ చదువుకోండి అంటూ  పవన్ కు కౌంటర్ ఇచ్చారు. 

Also Read: తిరుపతి లడ్డూ వివాదం వేళ.. షారుఖ్‌ డిక్లరేషన్‌ ఫామ్ వైరల్!

#pawan-kalyan #prakash-raj #Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe