విశాఖ ఫిషింగ్ హర్బర్‌ ప్రమాదం వెనుక యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని..!

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హర్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్త కోణం వెలుగుచూసింది. నిన్న రాత్రి అక్కడ కొందరు పార్టీ చేసుకోవడంతో గొడవ జరిగిందని.. ఈ గొడవలో యూట్యూబర్‌ లోకల్‌ బాయ్ నాని ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
విశాఖ ఫిషింగ్ హర్బర్‌ ప్రమాదం వెనుక యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని..!

ఆదివారం రాత్రి విశాపట్నంలోని ఫిషింగ్‌ హర్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఓ కొత్త కోణం వెలుగుచూసింది. నిన్న రాత్రి అక్కడ జరిగిన ఓ పార్టిలో గొడవ జరిగిందని.. అయితే ఈ గొడవలో ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ అయిన లోకల్‌ బాయ్‌ నాని ఉన్నాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. లోకల్‌ బాయ్‌ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టాడు. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా కొంత సొమ్మును కూడా చెల్లించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత బాలాజి తన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే ఇదే క్రమంలో నిన్న రాత్రి గొడవ జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లోకల్‌ బాయ్‌ నాని, అతని స్నేహితులు పరారీలో ఉండగా.. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. సీఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన లెక్కలివే!

మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని.. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి వారికి సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు 40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగందని మత్స్యకారులు వాపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయం లోకల్‌ బాయ్‌ నానిని విచారించిన తర్వాతే పూర్తి బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ లోకల్‌ బాయ్‌ నాని ఎవరంటే ఇతను రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. వివిధ రకాల చేపలను పట్టుకుని వాటిని వండుకొని తెనే వీడియోలను నెటీనజ్లకు చూపిస్తుంటాడు. ఈ విడియోలలో నాని టీమ్‌ మెంబర్స్‌తో పాటు అతని భార్య కూడా కనిపిస్తుంటుంది.  ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే.. బోట్లు తగలబడిపోతున్న వీడియోను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Journalist Accreditation : జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

New Update
AP Journalist Accreditation

AP Journalist Accreditation

AP Journalist Accreditation:  ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..

జర్నలిస్టులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయాల్సిన అక్రిడేషన్‌ ను మరోసారి పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్ల  ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి అక్రిడేషన్‌ ముగిసి ఏడాది గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, గతంలో ఇబ్బడిముబ్బడిగా జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీచేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్రిడేషన్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇది మూడోసారి.  కాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాస్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అక్రిడేషన్‌ కార్డుల జారీలో నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అక్రిడేషన్ల జారీని పొడిగిస్తూ వస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పొడిగించిన అక్రిడేషన్‌ జూన్‌ 30తో ముగియనుంది. అప్పటికైనా కొత్త అక్రిడేషన్లు జారీ చేస్తారా? మరోసారి పొడిగిస్తారా? అనే అంశంలో క్లారిటీలేదు.

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఏపీలో ఈ నెల 31తో గడువు ముగియ నుండటంతో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల గడువు ఈ నెలతో ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలపాటు  పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పొడిగింపు జూన్‌ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే వరకు ఉంటుందని, ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు హిమాన్షు శుక్ల తెలిపారు.

Advertisment
Advertisment