Hyderabad Rajendranagar Incident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింది. చివరికి పోలీసుల విచారణలో ఆమె కట్టుకథ అల్లినట్లు తేలడంతో అందరూ షాకైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆ యువతి ఒక్కసారిగా ఇంట్లో కేకలు వేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఏమైందని అడిగారు. దీంతో ఆ యువతి.. ఇద్దరు ముసుగు వేసుకున్న దొంగలు ఇంట్లోకి వచ్చి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. వాళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించగా నన్ను తోసేసి పారిపోయారని చెప్పింది.
పూర్తిగా చదవండి..Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో.. ఓ యువతి తన ఇంట్లో దొంగలు పడి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. సమాచారం మేరకు పోలీసులు రావడంతో.. చివరికి ఆమె కట్టుకథ అల్లినట్లు తేలింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బు పోవడంతో ఈ డ్రామా చేసిందనట్లు పోలీసులు గుర్తించారు.
Translate this News: