Kurchi Thatha: పోలీసుల అదుపులో కుర్చీతాత.. ఇంతకీ ఈయన ఎవరు..?

కుర్చీని మడత బెట్టి అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషాను పోలీసులు అరెస్టు చేశారు. కుర్చీ తాతను సంగీత దర్శకుడు థమన్ వద్దకు తీసుకెళ్లిన వైజాగ్ సత్యతో పాటు స్వాతి నాయుడు ఫిర్యాదు చేయడంతో పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Kurchi Thatha: పోలీసుల అదుపులో కుర్చీతాత.. ఇంతకీ ఈయన ఎవరు..?

Kurchi Thatha Arrested: సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎవరు, ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నా వారికి గుర్తింపు దక్కదు. మరికొందరు మాత్రం ఒక్క డైలాగ్‌తో తమకంటూ ఓ క్రేజ్‌ సంపాదించుకుంటారు. అలా ఆ ఒక్క డైలాగ్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు కుర్చీ తాత అలియస్ షేక్ అహ్మద్ పాషా (Shaik Ahmed Pasha). కుర్చీని మడత బెట్టి *** అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. ఈయన పాపులారిటీ ఎంతలా వెళ్లిందంటే టాలివుడ్ అగ్రహిరో మహిష్‌బాబు (Mahesh Babu) నటించిన గుంటూరు కారం సినిమాలో (Guntur Kaaram) ఓ ఐటైమ్‌ సాంగ్‌కు ఈ డైలాగ్‌ను వాడేంతా.

గుంటూరు కారంలో వచ్చిన ఈ పాటతో కూడా కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన తాజాగా అరెస్టు కావడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఎవరూ అసలీ కుర్చీ తాతా ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్క్ వద్ద కుర్చీ తాతా ఉండేవాడు. అయితే ఓసారి ఓ యూట్యూబ్‌ ఛానల్ అతడ్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆ యూట్యూబ్ ఛానల్‌కు వివరించారు.

అత్తింట్లో గొడవ

ఒకసారి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోతే.. ఆమెను తెచ్చుకునేందుకు అత్తారింటికి వెళ్లానని షేక్ అహ్మద్ పాషా చెప్పాడు. అయితే అతని బామ్మర్దులు కత్తులు తీసుకొని మీదకి రావడంతో పక్కనే ఉన్న ఇనుప కుర్చీని మడత పెట్టి దెం*** మెడలు ఇరిగిపోయాయి అంటూ తెలిపారు. దీంతో ఆయన చెప్పిన ఈ డైలాగ్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, మిమ్స్‌ ఇలా ఎక్కడా చూసినా కుర్చీ తాతానే కనిపించేవారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు కుర్చీ తాత.

కిడ్నాప్‌ అయిన కుర్చీ తాతా

అయితే కూర్చీ తాత ఓసారి కొందరు పొలిటీషియన్స్‌ను దారుణంగా తిట్టాడు. కేసీఆర్, పవన్ కల్యాణ్, కేటీఆర్‌ లాంటి ప్రముఖులపై కూడా విరుచుకుపడ్డారు. దీంతో అతనికి కొంతమంది శత్రువుల ఏర్పడి వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు దాడులు కూడా చేశారు. ఓసారి కుర్చితాత అనుహ్యంగా కిడ్నాప్ అయ్యాడు. అతని భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ ఈయన మిస్సింగ్ అన్నట్లు ప్రచారం చేయడంతో చివరికి ఆయన ఆచూకీ తెలిసింది.

Also Read: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ నిర్ణయం..!

రూ.లక్ష పారితోషకం..!

అయితే ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు సినిమాలో కుర్చిని మడత పెట్టి అనే సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇందులో కుర్చి తాత డైలాగ్‌ను తీసుకోవడంతో.. అతనికి మరింత గుర్తింపు వచ్చింది. ఈ డైలాగ్ చెప్పినందుకు కుర్చి తాతకు చిత్ర యూనిట్ రూ.లక్ష పారితోషకం ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా కుర్చీ తాత అరెస్టు కావడం చర్చనీయాంశమైంది.

వైజాగ్ సత్య, స్వాతీ నాయుడు

సోషల్ మీడియాలో ఫేమస్‌ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి.. కుర్చీ తాతను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ దగ్గరికి తీసుకెళ్లి ఆర్థికసాయం అందేలా చొరవ తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులు తానే కాజేశానని.. కుర్చీ తాత సోషల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను, స్వాతి నాయుడ్ని బూతులు తిడుతూ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడని.. వైజాగ్‌ సత్య కనిపిస్తే నరికేస్తానంటూ కామెంట్‌ చేస్తున్నాడని పేర్కొన్నాడు.

అయితే తమన్‌ను కలిసినట్టుగానే మహేశ్‌ బాబు అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇప్పించాలంటూ కుర్చీ తాత పట్టుబట్టాడట. అయితే అది తనవల్ల కాదంటూ వైజాగ్ సత్య స్పష్టంగా చెప్పేయడంతో వారిద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయట. ఇక అప్పటి నుంచి యూట్యూబ్‌లో తనపై కాలా పాషా బూతులు మొదలు పెట్టాడంటున్నాడు సత్య. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు