ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రానున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదలైంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అనంతరం 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. తర్వాత 2:30 కి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మహబూబ్ నగర్ కు మోదీ బయల్దేరుతారు. తర్వాత 3:05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. 3:15 గంటల నుంచి 4:15 గంటల వరకు మహబూబ్ నగర్ లో జరిగే భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 4:30 గంటలకు మహబూబ్ నగర్ నుంచి బయల్దేరి 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 5:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi Telangana Tour: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
Translate this News: