PM Modi : ఎన్నికల్లో విక్టరీ తర్వాత ప్రధాని మోదీ సందేశం..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌' అనే మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు.

3 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం.. పేదలకు మోదీ 3.0 ఫస్ట్ గుడ్ న్యూస్
New Update

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి (NDA Alliance) మెజార్టీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అనే మంత్రం గెలిచింది. మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. మధ్యప్రదేశ్‌, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్‌ చేశాము. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో కూటమి ప్రభావం చూపించింది. జమ్మూ కశ్మీర్‌ (Jammu & Kashmir) లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ప్రజలు.. ఎన్డీయేకు పట్టం కట్టారు. ఒడిశాలో బీజేపీ సర్కార్‌ ఏర్పాటు చేయబోతుంది. కేరళలో ఒక సీటు గెలిచాం.1962 తర్వాత మూడోసారి అధికారంలోకి ఏ పార్టీ రాలేదు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతిఒక్కరు గర్వించేలా ఉంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతిఒక్కరి ధన్యవాదాలని' ప్రధాని మోదీ అన్నారు.

Also Read: ఇది మోదీ వ్యతిరేక తీర్పు.. ఎన్నికల ఫలితాలపై ఖర్గే, రాహుల్ రియాక్షన్

#telugu-news #pm-modi #nda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe