Modi Nizamabad Tour: ప్రధాని మోదీ రేపు మరో సారి తెలంగాణలో (PM Modi Telangana Tour) పర్యటించనున్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆ జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాని మధ్యాహ్నం 2:10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 2:55 గంటలకు బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కు చేరుకుంటారు మోదీ. 3:00 నుంచి 3:35 వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3:45 నుంచి 4:45 వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. తర్వాత 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి 5:45 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని.
ఇది కూడా చదవండి: Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..
Modi Nizamabad Tour: రేపు నిజామాబాద్ పర్యటనకు మోదీ.. పసుపు బోర్డు ప్రకటన తర్వాత తొలిసారిగా..
ప్రధాని మోదీ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Translate this News: