PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి చాయ్ ఇచ్చిన రోబో..సోషల్ మీడియాలో వైరల్..!

ప్రధాని నరేంద్రమోదీకి ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు. ఆనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

New Update
PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి చాయ్ ఇచ్చిన రోబో..సోషల్ మీడియాలో వైరల్..!

PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) ఓ రోబో చాయ్ అందించింది. అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.  వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ (Robotics Gallery)ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో ఆయనకు చాయ్ అందించింది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌’ 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్‌ (Chai) ఇచ్చింది. గుజరాత్ సైన్స్ సిటీలో రోబోటిక్స్ గ్యాలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, రోబో తమకు చాయ్ ఇచ్చిన ఫోటోను అస్సలు మిస్ కావొద్దని క్యాప్షన్ పెట్టి ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. రోబోటిక్స్ గ్యాలరీలో తనకు ఓ రోబో టీ సర్వ్ చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.


2003లో గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వైబ్రంట్‌ గుజరాత్‌ తొలి సదస్సు జరిగింది. నాటి సంగతులను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ తొలి సదస్సు జరిగినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులెవరూ సమావేశాలకు రాలేదని.. నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తే.. వారు రాజకీయాలు చూశారు’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించారు.