Ex DSP Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు

సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

New Update
Ex DSP Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు

Ex DSP Praneeth Rao: సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్‌రావు మీద ipc 409, 427, 201, 120(బీ), PDPPయాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల రూ.1000.. సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన

అసలేం జరిగింది..

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

ఇక, నేరపూరితమైన కుట్రలో భాగంగానే ఫైల్స్ ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్‌లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. కుట్రలో భాగంగానే సమాచారం మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించిన పోలీస్ శాఖ.. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసు శాఖ రంగం సిద్ధం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు