Paytm Crisis Started Corrections : పేటీఎం(Paytm) మాతృ సంస్థ వన్-97 కమ్యూనికేషన్స్(One97 Communications) బోర్డు శుక్రవారం, ఫిబ్రవరి 9న గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. కంప్లయన్స్ – రెగ్యులేషన్ విషయాలను మరింత బలోపేతం చేయడంలో బోర్డుతో కలిసి పనిచేయడానికి గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కమిటీకి సెబీ(SEBI) మాజీ చీఫ్ ఎం. దామోదరన్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీలో ఆర్బిఐ నామినేట్ చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మాజీ ప్రెసిడెంట్ ముకుంద్ మనోహర్ చితాలే వంటి అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారు. చితాలే బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (NACAS)కి మాజీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కూడా కావడం గమనార్హం. చితాలేతో పాటు ఆంధ్రాబ్యాంక్ మాజీ ఛైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. రామచంద్రన్ వంటి బ్యాంకింగ్ నిపుణులు కూడా ఈ ప్యానెల్లో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Paytm Crisis : పేటీఎం దిద్దుబాటు చర్యలు.. గ్రూప్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సెబీ మాజీ చీఫ్ ఎం.దామోదరన్ అధ్యక్షత వహిస్తారు.
Translate this News: