Pawan kalyan:జనసేనాని గోదావరి జిల్లా పర్యటన ఫిక్స్...షెడ్యూల్ ఇదే.

కాకినాడ కేంద్రంగా గోదావరి జిల్లాల పై జనసేనాని పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ మూడు రోజులపాటూ పర్యటించనున్నారు. డిసెంబర్ 28,29,30 తేదీ లలో పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు.

New Update
Pawan Kalyan: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!

గోదావరి జిల్లాల్లో పర్యటించడానికి జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి కాకినాడ చేరుకోనున్న పవన్ మూడు రోజుల పాటూ ఇక్కడే బస చేయనున్నారు. జపవన్ కళ్యాణ్ డిసెంబర్ 28,29,30 తేదీ లలో మొత్తం గోదావరి జిల్లాల్లో తిరిగి చర్చలు, ర్యాలీల్లో పాలొననున్నారు. దీంతో అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడి రూరల్ ఇన్చార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట జంక్షన్ నుండి విద్యుత్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ బస చేస్తారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. రేపటి నుండి విద్యుత్ నగర్ చల్లా పంక్షన్ హల్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు కార్యకర్తలు తో జనసేనాని అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉండాలి. ఏమేమి చేయాలి లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:కరుగుతున్న మంచు ఫలకాలు..భూమి స్థితిగతులనే మార్చేస్తుందా?

Advertisment
తాజా కథనాలు