/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/fans-jpg.webp)
Jagan and Pawan fans Fight: ఏపీలో అథికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ప్రతి బహిరంగా సభలోనూ పవన్ పై కౌంటర్లు వేస్తూ వస్తున్నారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని, ముచ్చటగా మూడు పెళ్లిలు చేసుకున్నాడని ఎగతాళి చేస్తూ వచ్చారు. ఇలా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు.
Also Read: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అసమ్మతి సెగ.. పుట్టపర్తి వైసీపీలో తారాస్థాయికి చేరిన విబేధాలు..!
అయితే, వీరు విమర్శలు చేసుకోవడం ఏమో గాని, ఈ రెండు పార్టీల అభిమానులు మాత్రం వాళ్ల నాయకుడి గురించి ఏమైనా తక్కువుగా మాట్లాడుతే ఏ మాత్రం సహించరు. మా నాయకుడిని అంటావా అంటూ ఇరువర్గాలు గొడవలకు దిగుతుంటారు. భయంకరంగా కొట్టుకుని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన ఘటనలు కూడా చాలనే ఉన్నాయి.
Also Read: నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్
అయితే తాజాగా, హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో పవన్, జగన్ అభిమానులు బీభత్సంగా కొట్టుకున్నారు. యాత్ర 2 మూవీ ప్రదర్శనలో ఓ సీన్ ను ఉద్దేశించి పరస్పర విమర్శలు చేసుకున్నారు. అలా మాటా మాటా పెరిగి ఇరు వర్గాలు పరసర్పం దాడికి దిగారు. థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. వెంటనే అలర్ట్ అయిన యాజమ్యానం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు వారిని అదుపు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, దర్శకుడు మహీ వి.రాఘవ్ సరిగ్గా ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో యాత్ర(Yatra) అంటూ వైఎస్సార్(YSR) బయోపిక్ ను సినిమా తీశారు. రాజకీయంగా ఈ సినిమా వైసీపీకి కాస్త మైలేజీని ఇచ్చింది. అదే ఊపులోనే మహీ వి. రాఘవ్ యాత్ర 2 పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసైనికులు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు.