Paris Olympics 2024 : నిరాశ పరిచిన సాత్విక్‌-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్‌ క్వార్టర్స్‌లో ఓడిన ఇండియా

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి మరోసారి నిరాశ పరిచారు. గురువారం జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్‌- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది.

Paris Olympics 2024 :  నిరాశ పరిచిన సాత్విక్‌-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్‌ క్వార్టర్స్‌లో ఓడిన ఇండియా
New Update

Satwik - Chirag Badminton: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి మరోసారి నిరాశ పరిచారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో వీరు ఓడిపోయారు. గురువారం జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్‌- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో సాత్విక్‌-చిరాగ్ ద్వయం మలేసియా జంటపై ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో గేమ్‌లో మలేసియా జోడీ అద్భుతంగా ఆడింది.

Also Read : భారత హాకీ జట్టుకు షాక్.. బెల్జియం చేతిలో ఇండియా ఓటమి

ఒకదశలో 4-0తో వెనకబడిన ఆరోన్‌- సో వూయి ద్వయం తర్వాత వేగంగా పుంజుకుని భారత జోడీపై ఎదురుదాడికి దిగి గేమ్‌ను వంశం చేసుకుంది. మూడో గేమ్‌లో 2-5తో వెనుకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5తో స్కోరును సమం చేసింది. తర్వాత గేమ్ హోరాహోరీగా సాగింది. ఒకదశలో 16-16తో స్కోర్లు సమం అయ్యాయి. అనంతరం భారత జోడీ తేలిపోయింది. ఇక ఈ ఓటమితో భారత అభిమానులు నిరాశ చెందారు. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఇటీవల బాగా ఆడుతున్నప్పటికీ, కీలక మ్యాచ్‌లలో తమ ప్రతిభను నిరూపించలేకపోతున్నారు.

#paris-olympics-2024 #india-at-olympics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe