Ex MLA Shakeel Son Case : హైదరాబాద్(Hyderabad) లోని తెలంగాణ ప్రజాభవన్(Telangana Praja Bhavan) గేటును తాగి కారు నడిపి గుద్దిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్(Shakeel Son Sahil) నిందితుడు. ఇదే కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు(Punjagutta CI Durga Rao) కూడా నిందితుడిగా ఉన్నారు. సాహిల్ను తప్పిండచంలో సీఐ సహాయం చేశారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఇంతకు ముందే ఈ కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న దుర్గారావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతను అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఈ కేసు కోర్టులో విచారణకు రాకముందే సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఆంధ్రాలోని గుంతకల్లు రైల్వే స్టేషన్(Guntakal Railway Station) లో దుర్గారావు పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. వెస్ట్ జోన్ డీజీపీ ఆఫీస్లో ఇతన్ని విచారిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ దుర్గారావు అరెస్ట్
హైదరాబాద్ పంజాగుట్ట సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాభవన్ గేటును కారుతో గుద్దిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించడానికి సీఐ పాటుపడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలోని గుంతకల్లులో ఇతనిని అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: