మహబూబ్నగర్ నియోజకవర్గంలో అభివృద్ది మాటున అరాచకం జరుగుతుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నిశ్చయించుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని.. బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణను శాసిస్తోందని ఆరోపించారు. బీసీలకు ఆదరణ లేని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు.
Translate this News: