Food Poison: పొరపాటున కూడా వీటిని రీ-హీట్‌ చేసి తినవద్దు, తాగవద్దు.. డేంజర్‌లో పడినట్టే!

కొన్ని ఆహార పదార్థాలను రీ-హీట్ చేసి తింటుంటారు, తాగుతుంటారు. నూనెను మళ్లీ వేడి చేసి రీ-యూజ్‌ చేయడం వల్ల క్యాన్సర్‌ బారిన కూడా పడవచ్చు. టీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి.

New Update
Food Poison: పొరపాటున కూడా వీటిని రీ-హీట్‌ చేసి తినవద్దు, తాగవద్దు.. డేంజర్‌లో పడినట్టే!

Food Poison: చాలామంది తిన్న తర్వాత ఫుడ్‌ ఐటెమ్స్‌ మిగిలిపోతే వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి తర్వాత రీ-హీట్ (Re-heat) చేసి తింటుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని ఆహారాలు వేడి చేసిన తర్వాత తింటే మీ శరీరానికి విషపూరితం చేస్తాయి. కొన్ని ఫుడ్‌ ఐటెమ్స్‌ను వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్‌ ఐటెమ్స్‌ రీహీట్ చేయోద్దో వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇది సరైన పద్ధతి కాదు

  • చాలా మంది టీ చల్లారిపోయిందని మళ్లీ రీ-హీట్ చేసి తాగుతుంటారు. ఇది సరైనది కాదు. మళ్లీ వేడి చేసి టీ తాగడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తిమ్మిర్లు, జీర్ణక్రియ లాంటి సమస్యలు ఎదురవుతాయి.
  • పూరీలు మొదలైనవి తయారు చేసేటప్పుడు ఆ నూనెను తిరిగి ఉపయోగిస్తాము. కానీ నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల కడుపు ట్రాన్స్ ఫ్యాట్ గా మారుతుందని మీకు తెలుసా..? ఇది కడుపు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలకు దారితీస్తుంది.
  • అదేవిధంగా పుట్టగొడుగులను మళ్లీ ఉడికించి తింటే వాటిలో ఉండే ప్రోటీన్ పోతుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు అస్సలు మంచిది కాదు.
  • బచ్చలికూరలో ఇనుము కనిపిస్తుంది. ఇది తిరిగి వేడి చేసేటప్పుడు ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ లాంటి సమస్యలను కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: భోజనం తర్వాత కడుపులో మంట పెడుతుందా? ఈ హోం రెమెడీస్ మీ కోసమే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేయించిన శనగలు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు