ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, 13మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లో వరద విలయం సృష్టించటం కొత్త కాదు. ఈ దఫా భారీ వర్షాలకు తోడు మందాకిని పొంగి ప్రవహించటంతో 13 మంది గల్లంతయ్యారు. 2013లోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం సంభవించింది.

New Update
ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, 13మంది గల్లంతు

Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ వద్ద మందాకిని నదికి వరద పోటెత్తటంతో 13 మంది గల్లంతయ్యారు. దాదాపు 12 వరకూ షాపులు గల్లంతయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆగకుండా వర్షాలు పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం గురువారం అర్థరాత్రి ప్రాంతంలో  ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి పక్కనున్న కొండ చరియలు విరిగి కింద నున్న రెండు షాపుల మీద పడ్డాయి. ఆ సమయంలో షాప్‌ లోపల చాలా మంది నిద్రిస్తున్నారు. దాంతో  ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కొంత మంది గల్లంతు కాగా బండరాళ్లు పడడంతో రెండు దుకాణాలు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో అందులో నిద్రిస్తున్న వారంతా  గల్లంతయ్యారని  అధికారులు తెలిపారు. . సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్టీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

గాలింపు చర్యలు ముమ్మరం చేశాం

గల్లంతయిన 13 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరథామి(Uttarakhand CM Pushkar Singh Dhami) తెలిపారు. ఇందులో ఎనిమిది మందిని నేపాలీ వాళ్లుగా గుర్తించామని, మిగిలిన వాళ్ల వివారాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.  భారీ వర్షానికి తోడు  పైనుంచి రాళ్లు, వ్యర్థపదార్థాలు వచ్చి మీద పడుతూండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని   ఎన్డీ ఆర్ ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

భారీవర్షసూచన

మందాకిని నది(Mandakini River) ఉదృతంగా ప్రవహిస్తోంది.  డెహ్రాడూన్‌, హరిద్వార్‌, పౌరీ, ఉదమ్‌ సింగ్‌ నగర్‌ లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బాగేశ్వర్‌, నైనిటాల్, చంపావత్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించారు.  స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.   ఇకపోతే శుక్రవారం (4.8.23) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణశాఖ హెచ్చరించింది.  గురువారం . శని వారం కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పడతాయని, మళ్లీ ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

కేదార్ నాథ్ మార్గంలో కాలినడక ప్రారంభం అయ్యే ప్రాంతం గౌరీకుండ్.  ఈ ప్రాంతంలో భారీ వరదలు రావటం, ప్రాణ నష్టం సంభవించటం కొత్త కాదు. 2013లోనూ మందాకినీ నది తన ప్రతాపాన్ని చూపించింది.

Also Read: లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!

యూపీలోని సంభాల్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను భార్య కత్తితో కట్ చేసేసింది. అనంతరం అతడి నాలుకను నోటితో కొరికేసింది. కేకలు విన్న పొరుగువారు అతడిని హాస్పిటల్‌లో చేర్చారు.

New Update
UP Sambhal Wife Cut Husband Private part

UP Sambhal Wife Cut Husband Private part

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భార్య చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. దంపతులిద్దరూ గొడవ పడగా.. భర్త ప్రైవేట్ పార్ట్‌ను కత్తితో భార్య కట్ చేసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలుకను సైతం తన నోటితో కొరికేసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: కమల్ హాసన్‌కు బిగ్ షాక్.. ‘థగ్‌ లైఫ్‌’ మూవీ బ్యాన్..!

భర్త ప్రైవేట్ పార్ట్ కోసేసిన భర్య 

యూపీలోని సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దంపతులు నివశిస్తున్నారు. భర్త తన భార్య సోదరుడితో ఫోన్‌లో మాట్లాడటానికి పదే పదే నిరాకరించాడు. ఇదే విషయంపై భార్య, భర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య తన భర్తపై దాడికి దిగింది. ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలును సైతం తన నోటితో కొరికేసింది. 

Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్‌ఫోన్లు అదిరిపోయాయ్!

తీవ్ర గాయాలతో అతడు గట్టిగా అరవడంతో పొరుగువారు ఇంట్లోకి వచ్చి దాడిని ఆపారు. అదే సమయంలో ఆ మహిళ కూడా అనుమానాస్పద స్థితిల్లో యాసిడ్ తాగి పడిపోయింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరాదాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. తన భార్య తనను చంపాలనుకుందని, కానీ పొరుగువారు తనను కాపాడారని చెప్పాడు. 

Also Read: హైదరాబాద్‌లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!

ఇక ఈ దాడి సమయంలో కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారని, లేకుంటే తన భార్య తనను చంపేసేదని బాధితుడు తెలిపాడు. ఎందుకంటే ఆమె చేతిలో అప్పటికే కత్తి ఉందని, దానితో ఆమె తన ప్రైవేట్ పార్ట్ కోసిందని, ఆమె నోటితో తన కాలును కొరికిందని.. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయాను అని చెప్పాడు. మరోవైపు ఆ మహిళ సోదరుడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. కట్నం డిమాండ్‌ను తీర్చలేదని, తన సోదరిని కొట్టి బలవంతంగా యాసిడ్ తాగించాడని ఆమె భర్తతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశాడు. 

Advertisment
Advertisment