ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడేలా లేదు. దాదాపు 5 నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రంలో మరోసారి పరిస్థితి చేజారిపోయింది. ఇంఫాల్ లో ఇద్దరు విద్యార్థులను గుర్తుతెలియని దుండగులు హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాల ఘర్షణలో 34మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేజారిపోవడంతో మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు సెప్టెంబర్ 26 రాత్రి 7:45 నిలిపివేశారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ 5 రోజుల పాటు అమల్లో ఉంటుంది. అంటే అక్టోబర్ 1, 2023 రాత్రి 7:45 గంటల వరకు ప్రజలు ఇంటర్నెట్ సేవను ఉపయోగించలేరు. మొబైల్ ఇంటర్నెట్ డేటా సర్వీస్, VPN ద్వారా కూడా ప్రజలు ఇంటర్నెట్ను ఉపయోగించలేరని పరిపాలన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..Manipur : మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు…మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిపాలన మరోసారి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 5 రోజుల పాటు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు అక్టోబర్ 1 సాయంత్రం వరకు కొనసాగుతాయి.
Translate this News: