Ap Crime: వావివరసలు మరచి.. ఆరునెలల పసికందు పై!

విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటంతో బిడ్డకు తీవ్ర రక్తస్రావమైంది. పాప ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Ap Crime: వావివరసలు మరచి.. ఆరునెలల పసికందు పై!
New Update

Ap Crime: విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటంతో బిడ్డకు తీవ్ర రక్తస్రావమైంది. పాప ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసి బిడ్డని తల్లి ఊయలలో వేసి, వరుసకు చిన్నాన్న అయ్యే ఎకన్నని కాపలా ఉంచి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎంకన్న చిన్నారిపై అత్యాచారం చేయగా ఆ పాప బిగ్గరగా ఏడ్చింది. పాప ఏడుపు విని చిన్నారి అక్క అక్కడికి చేరుకుని తల్లిని తీసుకుని వచ్చింది.

తల్లి బిడ్డను చూడగా..బిడ్డ ప్రైవేట్‌ పార్ట్‌ నుంచి రక్తస్రావం అవుతుండడం గమనించి ఆరా తీయగా నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా.. పరారయ్యాడు. పాపని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల నుంచి వివరాలు సేకరించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Also read: హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

#vizayanagaram #crime #ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి