Bhadrachalam: భద్రాచలంలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థినీ డెత్

భద్రాచలంలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొణిజర్ల మండలం సిద్ధిక్‌నగర్‌కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) అనే విద్యార్థిని కాలేజీ భవనం పై నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Bhadrachalam: భద్రాచలంలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థినీ డెత్
New Update

Bhadrachalam Nursing College Student Incident: భద్రాచలంలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో చోటుచేసుకున్నది. కొణిజర్ల మండలం సిద్ధిక్‌నగర్‌కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది. గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్‌రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపుగాయాలతో పడి ఉన్న విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్‌ వార్డెన్‌కు తెలిపింది.

వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్టు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. ఆసుపత్రి వద్ద కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగగా గిరిజన, దళితసంఘాల నాయకులు మద్దతు పలికారు. భద్రాచలం ఏఎస్పీ ఆసుపత్రి వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా కారుణ్య కళాశాల భవనంపైకి వెళ్లినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కావడంతో ఎందుకు వెళ్లి ఉంటుందోనని పోలీసులు ఆరా తీరుస్తున్నారు. పై అంతస్తు నుంచి తానే దూకిందా? లేక ఎవరైనా తోసివేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హాస్టల్ లోకి ఆఘంతకుడు ప్రవేశించడం చూశామన్న కళాశాల విద్యార్థినులు. అసలు విషయాన్ని కప్పిపుచ్చుతున్న కళాశాల యాజమాన్యం. కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరపాలని దళిత సంఘాలు పట్టుపడుతున్నాయి.

Also read: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్‌ అలర్ట్ జారీ!

#telangana #suicide #nursing-student #bhadrachalam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe