మహేష్‌ బాబు ఇంటికి కొత్త అతిథి!

మా ఇంటికి కొత్త గెస్ట్‌ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్‌ రెడీ గా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

New Update
మహేష్‌ బాబు ఇంటికి కొత్త అతిథి!

కొంత కాలం క్రితం మహేశ్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ మా ఇంటిలోని ముఖ్యమైన వారిని ఒకరిని కోల్పోయాం. ఆ బాధలో నుంచి ఇప్పుడు అప్పుడే బయటకు రాలేము అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె బాధను పంచుకున్నారు. అసలేం అయ్యిందంటే..సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ముద్దల తనయ సితార ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ప్లూటో అనే కుక్క పిల్ల కొంత కాలం క్రితం చనిపోయింది.

ఆ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా నమ్రత మరో కొత్త పోస్ట్‌ ను అభిమానులతో పంచుకున్నారు. మా ఇంటికి కొత్త గెస్ట్‌ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్‌ రెడీ గా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

ఇంతకీ సితారతో ఆడుకోవడానికి వచ్చిన ఆ కొత్త గెస్ట్‌ ఎవరూ అనుకుంటున్నారా? స్నూపీ..నమ్రత సితార కోసం ఓ కొత్త కుక్క పిల్లను తీసుకుని వచ్చారు. దానికి సూప్నీ అని నామకరణం కూడా చేశారు. తన రాకతో కుటుంబం మొత్తం ఎంతో సంతోషంతో ఉందని ఆమె తెలిపారు.

ఏడు సంవత్సరాలుగా మహేశ్‌ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా ఉంటున్న ప్లూటో అనే కుక్కపిల్ల కొద్ది రోజుల క్రితం చనిపోయింది. ప్లూటో జ్ఙాపకాలను మరచిపోలేకపోతున్నామంటూ కొద్ది రోజుల క్రితం నమ్రత ఓ ఎమోషనల్ పోస్ట్‌ ను నెట్టింట పంచుకున్నారు. ఇప్పుడు ప్లూటో మా వద్దకు ఓ కొత్త కుక్క పిల్లను పంపింది.

దాని పేరు స్నూపీ..మా అందరి ఆనందాలు నీతో ముడిపడి ఉన్నాయంటూ ఆమె రాసుకొచ్చారు. ఓ వైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ. మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమతో పెంచుకోబోతున్నాం అనే సంతోషంతో నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.. నిన్ను మరింత ప్రేమిస్తాం’’ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్‌ చేసి అంటూ వారు కొత్తగా తీసుకుని వచ్చిన కుక్కు పిల్ల ఫోటోను ఇన్ స్టాలో పెట్టారు.

Advertisment
తాజా కథనాలు