భారత్లో జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే.. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRP) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (IEA) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (BSA) రాబోతున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా.. మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, పెద్ద నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి రూల్స్ అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలో రాజద్రోహం స్థానంలో.. దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్రం ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..New Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు
భారత్లో జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే.. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారనున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా.. మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Translate this News: