Suicide: బంధువులు కాదు రాబందులు..టార్చర్‌ భరించలేక యువజంట ఆత్మహత్య!

తాను చేసిన తప్పును భర్త క్షమించినప్పటికీ బంధువులు మాటలతో హింసించి, దుష్ప్రచారం చేస్తున్నారనినిజామాబాద్‌ లో ఓ యువజంట రైలు పట్టాల పై పడి ఆత్మహత్య కు పాల్పడింది.. దీని గురించి ఆ జంట సెల్ఫీ వీడియో ద్వారా కోటగిరి ఎస్సై కి తెలియజేశారు.

Suicide:  బంధువులు కాదు రాబందులు..టార్చర్‌ భరించలేక యువజంట ఆత్మహత్య!
New Update

Suicide: బంధువులు రాబందుల్లా మారి వేధిస్తుంటే తట్టుకోలేకపోయిన ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌ మండలం హెగ్డోలికి చెందిన అనిల్‌ (28), పొతంగల్‌ కు చెందిన శైలజ (24) లకు గతేడాది వివాహం జరిగింది.

వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపి సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. తరువాత సెల్‌ ఫోన్‌ లో సెల్ఫీ వీడియో లో '' తాను ఓ తప్పు చేశానని..దాన్ని నా భర్త క్షమించినప్పటికీ..బంధువులు మాత్రం వారి మాటలతో హింసిస్తూ తమ పై దుష్ప్రచారం చేస్తున్నారని, దాన్ని తట్టుకోలేక మేమిద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు శైలజ వీడియోలో వివరిస్తూ ఆ వీడియోను కోటగిరి ఎస్సై సందీప్‌ కు పంపారు.

ఆయన వెంటనే నవీపేట ఎస్సై యూదగిరి గౌడ్‌ కు వీడియోతో పాటు వారి సెల్‌ నంబర్లను కూడా పంపారు. వారిద్దరూ గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బాసర వంతెన వద్దకు వెళ్లి వెదకగా ఎక్కడ వారి జాడ కనిపించలేదు.బాధితుల ఫోన్‌ నంబర్‌ ట్రాక్‌ చేయగా ఫకీరాబాద్‌- మిట్టాపూర్‌ మధ్య వారి మొబైల్‌ సిగ్నల్‌ ట్రేస్‌ అవ్వడంతో అక్కడికి వెళ్లి గాలించగా..దంపతుల మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి.

రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై వివరించారు.

Also read: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్‌!

#nizamabad #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి