Boney Kapoor: బోనీకపూర్ పై నెటిజన్లు ఫైర్..!

దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల కోసం 'మైదాన్' స్క్రీనింగ్ చేశారు బోనీకపూర్. ఈ సందర్భంగా ప్రియమణి భుజం నడుముపై చేతులు వేసి బోనీకపూర్ పోజులివ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Boney Kapoor: బోనీకపూర్ పై నెటిజన్లు ఫైర్..!
New Update

Boney Kapoor: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలేం జరిగిందంటే 'మైదాన్' చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీల కోసం 'మైదాన్' స్క్రీనింగ్ చేశారు. ఆ సమయంలో స్క్రీనింగ్ థియేటర్ వెలుపల బోనీకపూర్ వచ్చిన అతిథులతో మాట్లాడుతూ ఉన్నారు.

Also Read: అంబానీ కోడలుకు శ్రీదేవి కూతురు బ్యాచిలర్ పార్టీ.. విందు ఫొటోస్ వైరల్!

అదే సమయంలో హీరోయిన్ ప్రియమణి అక్కడికి వచ్చింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా ప్రియమణి, బోనీకపూర్ ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీకపూర్ పోజులిచ్చారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బోని తీరుపై మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం ఎంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

#boney-kapoor #priyamani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe