Nayan : నేను అలా అనుకోలేదు..క్షమించండి..లేఖ విడుదల చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!

నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్‌ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను.

Nayan : నేను అలా అనుకోలేదు..క్షమించండి..లేఖ విడుదల చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!
New Update

Nayanthara : లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార(Nayanthara) ఇటీవల నటించిన చిత్రం అన్నపూరణి(Annapoorani). సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటుంది. గత 20 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకుంది.

లేడీ సూపర్‌ స్టార్‌ గా ఎదిగిన నయనతార ఇటీవల అన్నపూరాణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయితే అయ్యింది కానీ సినిమాని పట్టించుకున్న వారు ఎవరూ లేరు. సినిమా థియేటర్స్‌ లో కూడా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా విడుదల అయిన తరువాత సినిమా మీద పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

publive-image

ఈ సినిమాలో నయనతార ఓ బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. అయితే ఆమె చెఫ్‌ గా ఎదగాలనుకోవడంతో పాటు, ముస్లిం అబ్బాయితో ప్రేమ, బ్రాహ్మణ అమ్మాయి అయ్యి ఉండి నమాజ్‌ చేయడంతో పాటు చికెన్‌ తినడమే కాకుండా.. హీరో రాముడు నాన్‌ వెజ్‌ తిన్నాడు అని చెప్పడంతో కొందరి మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని తీవ్ర విమర్శలు వచ్చాయి.

.సినిమాపై, నయనతారపై, దర్శకుడిపై, నెట్‌ఫ్లిక్స్(Netflix) పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో కథకి మతా్ని, దేవుడ్ని జోడించి మనోభావాలు దెబ్బతీసేలా తీయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు నయనతార ఈ వివాదం గురించి స్పందించలేదు. తాజాగా నయన్ దీని పై స్పందించారు.

ఓ క్షమాపణ లేఖ రాసింది. నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్‌ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మేము ఒక పాజిటివ్‌ మెసేజ్‌ ఇద్దామనుకుంటే అది అలా అయిపోయింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది.

ఓటీటీ(OTT) నుంచి కూడా తీసేస్తారని మేము అనుకోలేదు. నా టీం ఎప్పుడూ ఒకరి మనోభావాల్ని దెబ్బ తీయాలని అనుకోలేదు. ఈ సమస్యని అర్థం చేసుకున్నాం. దేవుడ్ని పూర్తి నమ్మి రెగ్యులర్‌ గా దేవాలయాలకు వెళ్లే నేను ఇలా చేయడం ఇదే చివరిసారి. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను.

నా 20 ఏళ్ల సినీ పరిశ్రమలో నేను అందరికీ పాజిటివ్‌ ఎనర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను అని తెలిపింది. ఇక లెటర్ మొదట్లోనే జై శ్రీరామ్(Jai Shri Ram) అని రాసింది. దీంతో నయనతార రాసిన ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also read: 3 వేల మందికి ‘ టాటా ‘ బైబై..!

#jai-sri-ram #annapoorani #nayanthara #ott
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి