ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిజోరాంలోని అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణ గడవు సోమవారంతో ముగియడంతో అధికారులు.. అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఇక నవంబర్ 7న ఆ రాష్ట్రంలో ఒకే దశలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో దిగనున్నట్లు అధికారులు తెలిపారు.