Rahul Gandhi: మోదీ.. మోదీ అంటున్న బీజేపీ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. అయితే ..ఈ యాత్ర జరుగుతున్న మార్గంలోకి కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలు చేస్తూ దూసుకురాగా వారికి గాల్లో ముద్దులు పెడుతూ రాహుల్ అభివాదం చేశారు.