చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడి సూత్రధారి మృతి

చత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక అగ్ర నేతలు కూడా ఉన్నారు.  ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నారు.  ఈ చలపతి ఎవరో కాదు..  ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారిగా ఉన్నది ఈయనే.

New Update
Who was Chalapati

Who was Chalapati Photograph: (Who was Chalapati)

చత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల మృతుల సంఖ్య  27కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక అగ్ర నేతలు కూడా ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి కూడా ఉన్నారు.  ఈ చలపతి ఎవరో కాదు..2003లో ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారిగా ఉన్నది ఈయనే. అప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.  

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మటెంపాయిపల్లి గ్రామంలో జన్మించిన చలపతి చలపతి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్నారు.  ఇంటర్మీడియట్ విద్య తర్వాత 1990-91లో నక్సలైట్ ఉద్యమంలో చేరారు. అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో చేరేందుకు శ్రీకాకుళం వెళ్లారు. విశాఖపట్నంలో మావోయిస్ట్ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకున్న సమయంలో అతని వృత్తి, జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. కాలక్రమేణా, అతను స్థానిక కార్మికుడి నుండి మావోయిస్టు శ్రేణులలో ప్రముఖుడిగా ఎదిగాడు.  

గతంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాగా ప్రచారం పొందిన ఎన్‌కౌంటర్‌లో పట్టుబడకుండా తప్పించుకున్నాడు.  చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.   ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న చలపతి దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులు, ఊబకాయంతో బాధపడుతున్నారు.  చలపతి భార్య అరుణ కూడా చురుకైన మావోయిస్టు నాయకురాలు. ప్రత్యక్ష చర్య, వ్యూహాత్మక ప్రణాళిక రెండింటిలోనూ పాల్గొంటూ, మావోయిస్టు నాయకుల సైద్ధాంతిక నిబద్ధతకు చిహ్నంగా మారారు.

ఇక చత్తీస్‌గఢ్‌-  ఎన్‌కౌంటర్‌ మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్న,  నల్లగొండకు చెందిన మావోయిస్టు హనుమంతు కూడా ఉన్నారు.  డ్రోన్లతో మావోయిస్టు కదలికలను గుర్తించి.. నలువైపులా చుట్టుముట్టి 1000 మంది జవాన్లు విరుచుకుపడ్డారు. 50 గంటలకు పైగా ఆపరేషన్ కొనసాగుతుంది.   తాజా ఎన్‌కౌంటర్‌తో  ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా, గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు.  అంతేకాకుండా, 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా, 837 మంది లొంగిపోయారు.

Also Read :  HYD: దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు