ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై 6, 13, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
rape

Gang Rape: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. 6, 13, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు నిందితులు తమ ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 16న సాయంత్రం చోటుచేసుకుంది. ముగ్గురు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: పవన్ స్కెచ్.. జగన్‌కు షాక్!

తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో...

బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ వీర్ నేరస్థలాన్ని సందర్శించి ఫోరెన్సిక్ బృందంతో కలిసి పరిశీలించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) యోగేంద్ర బహదూర్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సింగ్ తెలిపారు. గత నెలలో ఇదే తరహా ఘటనలో నగరంలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జన ప్రదేశంలో ఏడేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఒకరు 8 ఏళ్లు, ఒకరు 7 ఏళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కారాగారానికి పంపారు పోలీసులు. కాగా నెల వ్యవధిలో జిల్లాలో ఇలాంటి అత్యాచార ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ అత్యాచారాలు కేసులో మైనర్లు ఉండడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

ఇది కూడా చదవండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు